Friday, April 16, 2010

Operation People Hunt

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దంతేవాడ జిల్లాలో ఏప్రిల్ 6వ తేదిన 76 మంది CRPF జవాన్లను మావోయిస్టులు హతమార్చడం మన అందరికి తెలిసిందే. భారతదేశ చరిత్రలో ఇంత దారుణమైన మారణకాండ జవాన్ల పై ఎన్నడు జరుగలేదు. ఈ దారుణాన్ని మనమంతా ఖండించాల్సిన విషయం, ఇది చాలా హేయమైన చర్య, ప్రజాస్వామ్యంలో హింసకు ఆమోదం లేదు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలని గమనిస్తే విస్తుపోక తప్పదు.

మొదటిది, కేంద్ర హోంశాఖ కార్యదర్శి G K పిళ్ళై తీవ్ర స్వరంతో " మా సత్తా ఏమిటో చూపిస్తాం" అంటూ ప్రతీకార ధోరణిలో మాట్లాడారు, దానిని చిదంబరం కూడా సమర్దించారు. (Please Refer Eenadu Archives)
ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి, విపత్కర పరిస్థితులలో statements ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సి ఉంటుంది. వారు వాడిన ప్రతీకార భాష అగ్గికి ఆజ్యం పోసినట్లుందే తప్ప.... స్వాంతన కాని, ఆలోచనధోరణని మార్చే దిశగా లేదు. నిజం చెప్పాలంటే వారి మాటలు CRPF జవాన్లకు ధైర్యం కల్పించే విధం గాను, చనిపోయినవారి కుటుంబాలకు ఓదార్పుగాను, మావోయిస్టులను ప్రజలందరి ముందు దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం జరగాలే తప్ప , ప్రతీకార భాష తో మావోయిస్టులను మరిన్ని దాడులకు ఉసిగొల్పే విధంగా, CRPF జవాన్లలో ప్రతీకారాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు.
రెండవది, చిదంబరం రాజీనామా నాటకం, దానిని ప్రధానమంత్రి ఆమోదించక పోవడం. 76 మంది జవాన్ల మరణానికి తానే భాద్యుడంటూ... గొప్ప మానవత్వాన్ని, నైతిక భాద్యతను చాటుకునే ప్రయత్నాన్నిరాజీనామా ద్వారా చేసారు. మరి డిసెంబర్ 2009 నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయమై... అస్పష్టమైన, అర్ధం చేసుకోవటానికి కష్టమైన, ద్వందర్దాలు కలిగిన statements ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 200 మందికి పైగా మరణాలకు ( ప్రత్యేక, ఉమ్మడి రాష్ట్రంకోసం ఆత్మహత్యలు) కారణమైన ఈ చిదంబరానికి అప్పుడెందుకు ఈ రాజీనామాలు , ఈ నైతిక భాద్యతలు గుర్తుకు రాలేదో ఆ చిదంబర రహస్యాన్ని ..చిదంబరం గారే చెప్పాలి.


అయితే చిదంబరం, 2003 వరకు Vedanta resources (British based multinational)  కంపెనీ లో డైరెక్టర్ గాను, ఆ కంపెనీ న్యాయవాది గాను పనిచేసిన విషయం ప్రజలందరికి తెలిసిందే Chidambaram -Wikipedia. ఛత్తీస్గఢ్ లోను, ఒరిస్సాలోను విస్తారమైన అటవీప్రాంతంలోగల అపారమైన ఖనిజ సంపదను అతి పెద్ద కార్పోరేట్ సంస్థలైన TATA , ESSAR , Vedanta resources లకు కేటాయించడం, దానివలన కొంతమంది ఆదివాసిలు నిరాశ్రయులుగా మారడం, వారికి మావోయిస్టులు మద్దతు తెలియజేయడం.. వాటి పరిణామాలు. కార్పోరేట్ సంస్థలను పరిరక్షించే నిమిత్తం, ప్రభుత్వం శాంతిభద్రత మరియు తీవ్రవాద నిర్మూలన సాకుతో మావోయిస్టుల పై అప్రకటిత యుద్ధం (Operation Green Hunt) ప్రారంబించడం ... ఆ తర్వాత ఈ మారణహోమం దాని పర్యవసానమే. మావోయిస్టులు మాత్రం తాము ఎప్పటికైనా ఢిల్లీ పీఠాన్ని అధిష్టించి సామ్యవాద సమసమాజ సామ్రజ్యాన్ని స్తాపించాలనే భ్రమతో… హింసాత్మక చర్యల ద్వారా ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మావోయిస్టుల చర్యలతో ప్రజలు ఎప్పుడో విసిగిపోయారు, ఇంకా కొన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు అంటే... అది ప్రేమతో, అభిమానంతో మాత్రం కానే కాదు, కేవలం భయంతోనే.


ఒక విధంగా చెప్పాలంటే .. మనకు, పాకిస్తాన్ కు ఈ అంతర్యుద్ధ విషయంలో కొంచెం సారుప్యత కనిపిస్తుంది. పాకిస్తాన్ తీవ్రవాదం అణచివేత పేరుతో అమెరికాసేనల మద్దతుతో గిరిజనులపై పోరాటం చేస్తుంటే , మనము బహుళజాతి కంపెనీల సంరక్షణ కోసం శాంతిభద్రతల పేరుతో, అభివృద్ధి పేరుతో మావోయిస్టులపై , ఆదివాసిలపై యుద్ధం చేస్తున్నాము. అభివృద్ధి తో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కూడా ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం. ఏది ఏమైనప్పటికీ... ప్రభుత్వ విధానాల ద్వారా చనిపోతుంది మనుషులే కాని క్రూరమృగాలు కాదు, వారు CRPF జవాన్లు అయిన, ఇంఫార్మర్స్ నెపంతో గిరిజనులు అయిన, మావోయిస్టుల అయిన ...అందరు భారతీయులే కాని చొరబాటుదారులు కారు, పరజాతీయులు కారు. కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం రాజీనామాకు ఉపక్రమించడం , హోంశాఖ కార్యదర్శి ప్రతీకారంతో రగిలిపోవడం లాంటి ఈ పరిస్థితులలో ప్రభుత్వం అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుని ఈ సమస్య కు పరిష్కారం కనుక్కోగలదని ఆశిద్దాం.
మీ కామెంట్సు: YashwanthX@Yahoo.com
´